Warangalvoice

Crime

Sangareddy | భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి
Crime

Sangareddy | భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్‌ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వరంగల్ వాయిస్, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్‌ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతని భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సుభాష్‌.. తన ఇద్దరు పిల్లలు మారిన్‌ (13), ఆరాధ్య (10) ఉరివేసి చంపేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘనటా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ...
గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి మృతి
Crime, District News

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి మృతి

శోకసంద్రంలో తల్లిదండ్రులు వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని పింగిలి రజనీకర్ రెడ్డి-నవత ఏకైక కుమారుడు పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేట డివిజన్ లోని మదర్స్ ల్యాండ్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 21న జరిగే పరీక్షలకు హాజరు కావాల్సిన అశ్వంత్ రెడ్డికి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గుండెపోటు రావడంతో హాస్పిటల్ కు తరలించారు. వైద్య చికిత్స పొందుతూ మరణించాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి, దండ్రులు గుండెలు అవిసేలా విలపించారు. కొడుకుకు జిల్లేడు చెట్టుతో పెళ్లి చేసి, పాడెకట్టి, తల కొరివిపెట్టిన తీరును చూసి గ్రామస్తులందరూ కంటతడి పెట్టారు....
Karimnagar | అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్.. రూ.11 లక్షల విలువగల సొత్తు స్వాధీనం
Crime

Karimnagar | అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్.. రూ.11 లక్షల విలువగల సొత్తు స్వాధీనం

తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ వాయిస్, మెటపల్లి : తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ  మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం మెటపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ అలియాస్ రవి అలియాస్ విజయ్(28) అను అతను నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డాడు. వివిధ పోలీస్ స్టేషన్స్‌ పరిధిలో ఇప్పటి వరకు 40 కేసులు నమోదవగా పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. గత కొంతకాలంగా మెటపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లలో వరుసగా దొంగత...
గురుకులంలో ఫుడ్ పాయిజన్
Crime

గురుకులంలో ఫుడ్ పాయిజన్

వాంతులు, విరోచనాలతో ఆస్పత్రికి మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గురుకుల పాఠశాలలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో పలువురు విద్యార్థులకు కడుపునొప్పి రావడంతోపాటు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 9వ తరగతి చదువుతున్న జి.సాయి ప్రసాద్, 7వ తరగతి చదువుతున్న బి.యాకుబ్, ఎల్.రాహుల్ సీరియస్ కావడంతో హుటాహుటిన గూడూరు ఏరియా హాస్పటల్ తరలించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మిగిళిన గురుకుల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైనప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి....
డీటీసీ ఇంట్లో ఐటీ సోదాలు
Crime

డీటీసీ ఇంట్లో ఐటీ సోదాలు

వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తు లు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఏక కాలంలో హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. పక్క సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిసినట్లు సమాచారం. సోదాల సందర్భంగా నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలసింది. అయితే లెక్కకు మించిన ఆస్తులున్నట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడయినట్లు ప్రచారం సాగుతోంది. రూ.50 కోట్లకు పైగా ఆస్తులను శ్రీనివాస్ కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైనట్లు సమాచారం....
Fake Cirtificate | దొంగ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగం
Crime

Fake Cirtificate | దొంగ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగం

విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలి కలెక్టర్ కు లంబాడి హక్కుల పోరాట సంఘం వినతి వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎస్టీ లంబాడి కులం పేరుతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ ఉద్యోగిగా చలామణి అవుతున్న గోపు స్వర్ణలతపై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర వెంకట్ నాయక్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవేండి గ్రామానికి చెందిన గోపు బాలశౌర్ రెడ్డి 1963 లో కడవేండి చర్చిలో గోపు సుశీలను వివాహం చేసుకున్నారు. వారికి హేమలత, స్వర్ణలత ఇద్దరు కూతుర్లు. గోపు సుశీల వ్యక్తిగత కారణాలతో ఇద్దరు కూతుర్లతో ఖాజిపేటకు వచ్చి ఫాతిమా నగర్ లో కిరాయి ఉంటూ జీవనం సాగిస్తోంది. అనంతరం గోపు సుశీల భూక్యా అంకుష్ వీధిలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటూ ఆయనతో స్నేహ...
Police Commissioner | గీత దాటితే లోపలేసుడే  (జైలే..)
Crime

Police Commissioner | గీత దాటితే లోపలేసుడే  (జైలే..)

సంతోషాల నడుమ వేడుకలు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వరంగల్ వాయిస్, క్రైం : సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ప్రజలకు సూచించారు. ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎలాంటి ఆవాంనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు పలుసూచనలు చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సర వేడుకలను ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి ఉంటుందన్నారు. సంస్కృతిక కార్యక్రమాల నిర్వహకులు తప్పని సరిగా పోలీసులనుంచి ముందస్తూ అనుమతులు తీసుకోవాలన్నారు. వేడుకలు నిర్వహించే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు తావులేదన్నారు. అలాగే కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలతోపాటు సెక్యూరిటీ సిబ్బందిని ఎర్పాటు చేసుకోవాలన్నారు. వేడుకల సమయంలో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా, చుట్టు పక్కల వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు...
సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్
Crime, District News

సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్

వరంగల్ వాయిస్, కేయూ : కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి పురం భగత్‌సింగ్‌నగర్ లో మంగళవారం సాయంత్రం సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ అక్రమ మద్యం, గంజాయి,గుట్కా, హెల్మెట్ ధరించడం , సీసీ కెమెరాల ప్రాముఖ్యత, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ వినియోగం పై కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో 20 ద్విచక్ర వాహనాలు, రెండు వేల రూపాయల గుట్కా స్వాధీనం చేసుకున్నారు.అనంతరం హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి కాలనీ పిల్లలకు బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో హనుమకొండ,కేయూసి ఇన్స్పెక్టర్ లు సతీష్,రవికుమార్, 7 మంది ఎస్‌ఐలు, 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.     under Central Zone DCP Sheikh Salima...
ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న కారు
Crime, District News

ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న కారు

ఇద్దరు యువకుల దుర్మరణం వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : వేగంతో వస్తూ అదుపు తప్పిన కారు.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే దుర్మరణం చెందిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. గూడూరు మండలం పోనుగోడు గ్రామానికి చెందిన సంగెం మణికంఠ (17), నీల అరుణ్ కుమార్ (16) ప్రాణస్నేహితులు. మణికంఠ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతి బా ఫూలే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ దసరా సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు తన స్నేహితుడు నీల అరుణ్ కుమార్ తో కలసి ద్విచక్ర వాహనంపై వెలుతున్నాడు. దీంతో మార్గం మధ్యలో జమాండ్లపల్లి సమీపంలోకి చేరుకోగానే మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు వైపు అతివేగంతో వెళ్తూ అదుపు తప్పిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అరుణ్...మణికంఠలు 50 మీటర్ల దూరం ఎగి...