Warangalvoice

Crime

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
Crime, Warangal_TriCites

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ఒకరికి తీవ్ర గాయాలుఎదురెదురుగా ఢీకొన్న బైకులువరంగల్ వాయిస్, ఆత్మకూరు : మండలంలోని దుర్గపేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం రెండు బైక్‌లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఆరూరి అశోక్ (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దామెర మండల బీజేపీ పార్టీ అధ్యక్షడు రాజ్ కుమార్ ను స్థానికులు హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు....
చోరీలకు పాల్పడిన నిందితులకై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయండి…సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌
Crime, Warangal

చోరీలకు పాల్పడిన నిందితులకై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయండి…సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం : చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వారిని అరెస్ట్ చేసి నిందితుల నుండి చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నప్పుడే ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం పెరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అధికారులకు సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని గురువారం కాకతీయ విశ్వవిద్యాలయము సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. వరంగల్‌ కమిషనరేట్‌ చెందిన పోలీస్‌ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న కేసులను సమీక్ష జరిపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు కేసుల పరిష్కారం కోసం అధికారులు తీసుకోవాల్సిన చర్యలను పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ...
దసరా పండుగకి ఊరికెళ్తున్నారా జర ఇల్లు భద్రం….వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.
Crime, Warangal

దసరా పండుగకి ఊరికెళ్తున్నారా జర ఇల్లు భద్రం….వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.

వరంగల్ వాయిస్, క్రైం :దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు.దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు, విహార యాత్రలకు తరలి వెళ్తుండడంతో ఇండ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అలాగే చోరీల కట్టడికై ప్రజలు సైతం తమ వంతు భాధ్యత పోలీసులు తెలిపిన ఈ క్రింది సూచనలను పాటించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ◆సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోండం మంచిది. ◆ తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్ లో లేదా మీగ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వండి.వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తాం. ◆ ...
శభాష్ పోలీస్… మానవత్వం చాటుకున్న దామెర ఎస్సై..
Crime, Warangal

శభాష్ పోలీస్… మానవత్వం చాటుకున్న దామెర ఎస్సై..

వరంగల్ వాయిస్, దామెర: వరంగల్ పోలీస్ కమీషనరేట్ దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన సంఘటనలో మానవత్వంతో ఎస్సై అశోక్ వ్యవహరించిన సమయస్ఫూర్తిని మండల ప్రజలు సెల్యూట్ దామెర పోలీస్ అంటూ ఆదివారం ప్రశంసల జల్లును కురిపించారు. వివరాల్లోకెళ్తే దామెరలోని శివాలయం వద్ద పోచారం గ్రామానికి చెందిన మనోహర్ తన ద్విచక్ర వాహనంపై హనుమకొండ వైపు వెలుచుండగా దామర గ్రామంలోకి రాగానే టూ వీలర్ కి అడ్డంగా కోతి రావడంతో సడన్ బ్రేక్ వేయడంతో రోడ్డు పై మనోహర్ పడడంతో తలకి బలమైన గాయం కావడంతో అటుగా దామెర ఎస్సై కొంక అశోక పెట్రోలింగ్ కోసం వెళ్తూతుండగా గమనించి వెంటనే 108 కి ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో స్వయంగా తన వాహనంలో గాయాలైన వ్యక్తిని తీసుకొని ఆరెపల్లి వరకు వెళ్లగా 108 వాహనం రావడంతో బాధితున్ని అందులో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ఎస్సై అశోక్ ని గ్రామ ప్రజలు, పలువురు నాయకులు ప్రశంసించారు....
విగ్రహ నిర్వాహకులకు అవగాహన సదస్సు
Crime, Cultural

విగ్రహ నిర్వాహకులకు అవగాహన సదస్సు

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని వివిధ గ్రామాలలోని గణ పతి విగ్రహ నిర్వాహకులతో ఎస్సై అశోక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, విద్యుత్ అనుమతులు సౌండ్ సిస్టం ఏర్పాటు, భద్రత చర్యలు గురించి కమిటీ నిర్వాహకులకు వివరించారు.ఈ సదస్సులో ఏఎస్ఐ,కానిస్టేబుల్,గణపతి విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు....
ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం….వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌
Crime, Warangal

ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం….వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం : విద్యాసంస్థల్లో ఎవరైన విద్యార్థులు ర్యాగింగ్‌ లాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ హెచ్చరించారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోవుతున్న తరుణంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ర్యాగింగ్‌ నియంత్రణపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదివారం ఓ ప్రకటన చేస్తూ విద్యా సంస్థలలో ర్యాగింగ్‌కు పాల్పడటం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని అన్నారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడే విధంగా వుంటుందని, ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్‌ విద్యార్థుల పట్ల అసాంఘిక కృత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల నుండి తొలగించడంతో పాటు ర్యాగింగ్‌ లాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ర్యాగింగ్‌ పాల్పడిన విద్యార్థుల విద్యా, ఉ...
పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్‌….వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌
Crime, Warangal

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్‌….వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం: వ్యక్తిగత వాహనాలపై పెండింగ్‌లో వున్న ట్రాఫిక్‌ చలాన్లు వాహనదారులు చెల్లించని పక్షంలో వాహనాన్ని సీజ్‌ చేస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ వాహనదారులకు హెచ్చరించారు.ఈ పెండింగ్‌ చలాన్లపై వరంగల్‌ పోలీస్ కమిషనర్ కొరడా ఝాలిపిస్తూ బుధవారం ఓ ప్రకటన చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోజు,రోజుకి పెరిగిపోతున్న వాహనాల సంఖ్యతో పాటు, వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడంతో పాటు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమవడంతో పోలీసులు తీసుకుంటున్న చర్యలను అతిక్రమించి వాహనదారులు వాహనాలను నడుపతున్నారని తెలిపారు. దీనితో పోలీసులు ట్రాఫిక్‌ నిబందనలు అతిక్రమించిన వాహనదారులపై ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానంలో పోలీసులు ట్రాఫిక్‌ జరిమానాలు విధించడం జరుగుతొందన్నారు.విధించిన ట్రాఫిక్‌ జరిమానాలను సైతం వాహనదారులు సకాలం...
ఇందిరమ్మ ఇళ్లలో కమీషన్ల వివాదం
Crime, Warangal_TriCites

ఇందిరమ్మ ఇళ్లలో కమీషన్ల వివాదం

లబ్ధిదారుడిపై కాంగ్రెస్ నాయకుల దాడి ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు వరంగల్ వాయిస్, పర్వతగిరి : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమకు కమీషన్ ఇవ్వలేదనే కారణంతో ఒక లబ్ధిదారుడిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ నాయకులు దాడి చేసిన సంఘటన పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితుడు ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. గ్రామానికి చెందిన కన్నే కల్పన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, మొదటి విడతలో లక్ష రూపాయలు ఆమె అకౌంట్‌లో జమ అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజు, నాయకుడు రమేష్.. కల్పన భర్త దేవేందర్‌ను సంప్రదించారు. గ్రామంలో చెరువు పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే ఖర్చుల నిమిత్తం మొదటి విడత నుంచి రూ. 10 వేలు, మొత్తం నాలుగు విడతలకు కలిపి రూ.40 వేలు కమీషన్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై దేవేందర్ ‘ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లక...
పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలి… వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌..
Crime, Warangal

పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలి… వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌..

వరంగల్ వాయిస్, క్రైం :పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్‌ అధికారులు పారదర్శకంగా న్యాయం అందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ నల్లబెల్లి పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ బుధవారం నల్లబెల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు స్టేషన్‌ పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ తో పాటు కిట్‌ ఆర్టికల్స్‌ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌, సిసిటిఎన్‌ఎస్‌ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్‌ సిబ్బందిని సీపీ అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసు...
పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం
Crime, Hanamkonda

పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం

వరంగల్ వాయిస్,హనుమకొండ : కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవ పథకాలలో భాగంగా వరంగల్ పోలీస్ కమీషనరేట్ టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం లభించింది. ఈ సందర్బంగా పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు పోలీస్ ఉన్నతాధికారులు,బంధుమిత్రులు,పలువురు శుభాకాంక్షలు తెలిపారు....