లక్షద్వీప్ ఎంపి సభ్యత్వం పునరుద్దరణ
సుప్రీం కేసు నేపథ్యంలో లోక్సభ దిద్దుబాటు చర్య
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: లక్షద్వీప్ ఎంపీ, ఎన్సీపీ సీనియర్ నేత మహ్మద్ ఫైజల్ లోక్సభ సభ్యత్వం విషయంలో.. లోక్సభ సెక్రటేరియెట్ వెనక్కి తగ్గింది. వెంటనే అతని ఓలక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. సుప్రీం కోర్టులో బుధవారం వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫైజపై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్సభ ప్రకటించింది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియెట్ జనరల్ పేరిట ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2016, జనవరి 5వ తేదీన ఫైజల్పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో ఓ హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. దీంతో జనవరి 13వ...









