Warangalvoice

స్వేరోస్ జ్ఞాన సంకల్పసభ గోడపత్రిక ఆవిష్కరణ


వరంగల్ వాయిస్, కేయూ :
స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈనెల 31న సిద్దిపేటలో నిర్వహించ తలపెట్టిన జ్ఞాన సంకల్ప సభ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ లను హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ ముందు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బీ.ఎస్.ఎఫ్) కేయూ అధ్యక్షుడు మన్నే దినాకర్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అనంతరం స్వేరోస్ ఇంటర్నేషనల్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్ర ప్రసాద్, బీఎస్ ఎఫ్ కేయూ ఇంఛార్జి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బొట్ల మనోహర్ మాట్లాడుతూ స్వేరో జ్ఞాన సంకల్ప సభకు చీఫ్ గెస్ట్ గా స్వేరోస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొంటున్నారని తెలిపారు. బహుజన మేధావులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణలో వరంగల్ జిల్లా మాజీ జాయింట్ సెక్రటరీ శనిగరపు శాజన్, బీఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షుడు రాజబాబు, గర్ల్స్ కన్వీనర్ హేప్సిబా, త్రివేణి, కల్యాణి, శ్రావణి, లాలూ ప్రసాద్, శ్రీకాంత్, సంపత్, బీరప్ప, షఫీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *