
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ వాయిస్, క్రైమ్ : రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతీ రిజిస్ట్రేషన్లలో 3.90కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రభుత్వ అదాయానికి గండి కొట్టిన మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది ప్రస్తుతం పరారీలో వున్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు 63.19 లక్షల నగదు, బ్యాంక్లో 1లక్ష రూపాయలు, సుమారు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్ టాప్లు, ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన వారిలో వసునూరి బసవ రాజు, యాదాద్రి జిల్లా, జెల్లా పాండు, యాదాద్రి జిల్లా,మహేశ్వరం గణేష్ కుమార్,ఇయాదాద్రి జిల్లా, ఈగజులపాటి శ్రీనాథ్, జనగామ, యెనగంధుల వెంకటేష్, జనగామ,కోదురి శ్రవణ్, జనగామ,కొలిపాక సతీష్ కుమార్, కొడకండ్ల (ఎం), జనగామ,తడూరి రంజిత్ కుమార్, నర్మెట్ట, జనగామ, దుంపల కిషన్ రెడ్డి, ఆత్మకూర్ (ఎం), యాదాద్రి జిల్లా, దశరథ మేఘావత్ , తుర్కపల్లి,నారా భాను ప్రసాద్, యాదగిరిగుట్ట, గొపగాను శ్రీనాథ్, యాదాద్రి జిల్లా ఒగ్గు కర్నాకర్ , యాదాద్రి జిల్లా, కమల్ల శివ కుమార్,అమంగల్, నల్లగొండ,అలేటి నాగరాజు, యాదాద్రి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడిస్తూ ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు ఇరువురు యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరి గుట్లలో అన్లైన్ సర్వీస్ నిర్వహించేవారని, ఇందులో నిందితుల్లో ఒకడైన గణేష్ తనకు తాను అన్ లైన్ సెంటర్లతో పరిచయం చేసుకోని చేల్లించాల్సన మొత్తాన్ని ఏన్.ఆర్.ఐ ఖాతా పే చేస్తానని చెప్పి రైతుల నుండి మొత్తం డబ్బులను మీ సేవ వ్యక్తుల ద్వారా వసూలు చేయించి అట్టి వసూలు చేసిన డబ్బు నుండి అన్లైన్ సర్వీస్ వ్యక్తులకు మరియు మద్యవర్తులకు కమిషన్ చోప్పున డబ్బు అందజేస్తూ ఇ చాలాన్ని ప్రధాన నిందితుడుకి పంపిచేవాడన్నారు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు అట్టి ధరణీ/భూభారతీ వెబ్సైట్లో ఇన్ స్పెక్ట్ ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చాలన్ రుసుము తగ్గించేవాడని, అనంతరం అట్టి ఛలాన్ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడని,
ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషన్ ను ఉపయోగించి నిందితులు ప్రభుత్వానికి చెల్లించిన రుసుము కు సంబంధించి వెబ్సైట్లో జారీ అయిన రసీదులను చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా మార్పు చేసి అనంతరం మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లించిన నకిలీ చలాన్లను స్థానిక యం.ఆర్.ఓ/ రిజిస్ట్రేషన్ కార్యాలయములో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మోసాలకు పాల్పడేవారన్నారు. ఈ విధంగా ప్రధాన నిందితులు ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడి కావున జనగామ, యాదాద్రి జిల్లాల్లో మీ సేవ, ఆన్లైన్ సర్వీసులు, మద్యవర్తుల వద్ద నమోదు కావాల్సిన ధరణీ, భూ భారతి రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రధాన నిందితులు తమ వద్దనే వెబ్ సైట్లో నమోదు చేసేవారని, ఇందుగాను ప్రధాన నిందితులు మిగితా వారికి పది శాతం నుండి 30శాతం వరకు కమిషన్ చెల్లించేవారన్నారు.
ఈ కేసుకు సంబంధించి జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబందించిన లావా దేవిల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారరని, అలాగే ఈ రెండు జిల్లాలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదు కాబడ్డాయని, ఇందులో జనగామ జిల్లాలో 7కేసులు, యాదాద్రి జిల్లాలో 15కేసులు నమోదు కాబడ్డాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.ఈ ముఠా పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, ఎ.ఎస్పీ పండరి చేతన్, జనగామ ఇన్సెస్పెక్టర్ సత్యనారయణ రెడ్డి, రఘునాథ్్పల్లి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో ఇతర ఎస్.ఐలు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.