- Rajesh Chandra | కామారెడ్డి జిల్లా ఎస్పీగా యం రాజేష్ చంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజేశ్ చంద్ర ప్రస్తుతం ఎస్పీగా వ్యవహరిస్తున్న సింధు శర్మ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.
వరంగల్ వాయిస్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎస్పీగా యం రాజేష్ చంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజేశ్ చంద్ర ప్రస్తుతం ఎస్పీగా వ్యవహరిస్తున్న సింధు శర్మ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారిస్తామని నూతన ఎస్పీ వెల్లడించారు. ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
