Warangalvoice

We Will Develope Ancient Temples In Kukatpally Says Mla Madhavaram Krishna Rao

MLA Madhavaram Krishna Rao | భవిష్యత్తులో అన్ని ఆలయాలు అభివృద్ధి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

వరంగల్ వాయిస్, కేపీహెచ్‌బీ కాలనీ : కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన దాసాంజనేయ స్వామి దేవాలయంలో ముందు భాగంలో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ఇవాళ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్య గారి నవీన్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూకట్‌పల్లి ప్రాంతంలోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రామాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని భవిష్యత్తులో అన్ని ఆలయాలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కురుమయ్య గారి కొండలరావు, గొట్టిముక్కల వెంగళరావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ తులసి రావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

We Will Develope Ancient Temples In Kukatpally Says Mla Madhavaram Krishna Rao
We Will Develope Ancient Temples In Kukatpally Says Mla Madhavaram Krishna Rao

RAO 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *