- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సీఎం రేవంత్రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హైదరాబాద్సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సీఎం రేవంత్రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ఆ తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించారని.. బంజరు భూములు, బల్లులు కూడా గుడ్లు పెట్టవు అన్నారని.. ఇప్పుడు మీరు జంతువుల గూళ్ళను వెంటాడి సామూహిక హత్యలు చేస్తారంటూ మండిపడ్డారు. మీ సమర్థన? అభివృద్ధా? ప్రభుత్వ భూమా? మీది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా?! మీరు ఎన్నికైన ప్రతినిధినా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్నా?! అంటూ ప్రశ్నించారు. విధ్వంసం మీ ఏకైక నినాదం! మీ ఖజానాను దాఖలు చేయడమే ఏకైక నినాదం! నేను మిమ్మల్ని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి.. మీ బుల్డోజర్లు వారాంతంలో, రాత్రిపూట ఎందుకు నిరంతరాయంగా పనిచేశాయి? మీరు కోర్టుకు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఏమి దాచారు? అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో హెచ్సీయూ భూముల్లో బుల్డోజర్లు చదును చేస్తుండడంతో అక్కడి అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జింకలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆగమాగం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. పెద్ద సంఖ్యలో అర్ధరాత్రి మోహరించిన బుల్డోజర్లతో నెమళ్లు అరుపులతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. కంచె గౌచ్చిబౌలిలోని హెచ్సీయూ సమీపంలో ఉన్న 400 ఎకరాల భూమిని ఇటీవల కాంగ్రెస్ అమ్మేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఆ స్థలాన్ని చదును చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున బుల్డోజర్లను మోహరించారు. చదును చేయడాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. ఆ భూమి యూనివర్సిటీదేనని పేర్కొంటున్నారు. ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలని.. అక్కడ ఉంటున్న జీవరాశిని కాపాడాలని విద్యార్థులతో పాటు పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
