- KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు కూడా అసెంబ్లీలో చాలాచాలా మాట్లాడుతున్నాడని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
వరంగల్ వాయిస్, సూర్యాపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు కూడా అసెంబ్లీలో చాలాచాలా మాట్లాడుతున్నాడని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి ఒక రాజకీయ పిగ్మి. కేసీఆర్ మోకాలి ఎత్తుకు సరిపోనోడు కూడా ఆహో ఓహో అని గర్జిస్తున్నాడు. గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి. వానపాములు కూడా నాగుపాముల్లాగా బుస కొడుతున్నాయి. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. 2001లో గులాబీ జెండా ఎగురేసి.. ఒక్కడిగా బయల్దేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరగుజ్జు ఔనన్నా కాదన్నా.. వానపాములు నాగుపాములై బుసకొట్టినట్టు యాక్టింగ్లు చేసినా కేసీఆర్ అనవాళ్లు చెరిపేస్తామని డైలాగులు కొట్టినా.. చరిత్ర చెరిపేయలేని సత్యం ఏదంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు అనేది అక్షర సత్యం. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది వాస్తవం. కేసీఆర్ వెంట ఎందరో నడిచారు. ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. చివరకు చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారు అని కేటీఆర్ తెలిపారు.
