Warangalvoice

Farmers Should Utilized Purchasing Centers Mla Vemula Veeresham

Grain Purchasing Centers : కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం

వరంగల్ వాయిస్, కట్టంగూర్ : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్ర‌భుత్వ మద్దతు ధర పొందాలని న‌కిరేక‌ల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అలాగే ప‌లుచోట్ల‌ సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు తన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, తాసీల్దార్ గుగులోతు ప్రసాద్, ఎంపీడీఓ పెరుమళ్ల‌ జ్ఞానప్రకాశ్‌రావు, వ్యవసాయ శాఖ అధికారి గిరిప్రసాద్, పీఏసీఎస్ సీఈఓ బండ మల్లారెడ్డి, ఏపీఎం సైదులు, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మ సాగర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుండు పరమేశ్‌, బండారి కృష్ణ, నాయకులు పెద్ది సుక్కయ్య, మిట్టపల్లి శివ, ముక్కాముల శేఖర్, బెజవాడ సైదులు, బూరుగు శ్రీను, దార భిక్షం, అయితగోని నర్సింహ్మ, కొంపెల్లి యాదయ్య, మర్రి రాజు, బుచ్చాల వెంకన్న పాల్గొన్నారు.

Farmers Should Utilized Purchasing Centers Mla Vemula Veeresham
Farmers Should Utilized Purchasing Centers Mla Vemula Veeresham

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *