- తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వం కేసీఆర్ది అని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ గుర్తు చేశారు. ఇవాళ షాద్ నగర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ వాల్ రైటింగ్ వేశారు.
వరంగల్ వాయిస్, షాద్ నగర్ : తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడంతోపాటు రాష్ట్ర అభివృద్ధిని కనులారా చూపించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని, స్వరాష్ట్రాన్ని సాధించి దేశంలోనే నెంబర్ 1 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ పాలన అని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. ఇవాళ షాద్ నగర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ వాల్ రైటింగ్ వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వం కేసీఆర్ది అని గుర్తు చేశారు. రైతు బంధు, రైతు భీమా, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికీ కేసీఆర్ పాలనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారని, మరో మారు కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు గ్రామాల నుంచి వందలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వంకాయల నారాయణ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్ మాజీ కౌన్సిలర్లు కానుగు ఆనంతయ్య, యుగంధర్, వెంకట్రాంరెడ్డి, చింటూ, బచ్చలి నరసింహా, నాయకులు శ్రవణ్ పట్వారీ, పిల్లి శేఖర్, చెట్ల నరసింహా, సుధీర్, భిక్షపతి, నందిగామ శ్రీనివాస్, చిన్న యాదగిరి, నరసింహా, గుండు అశోక్, రమేష్, శబ్బీర్, రాములు, పులిజాల నవీన్, అద్నాన్, మెహరాజ్, శ్రీకాంత్ గౌడ్, వెంకటేష్ గుప్తా, గుడ్డు యాదవ్, నవీన్ దుమ్మని, సంతోష్ నాయక్, సుశాంత్, శీలం శ్రీకాంత్, రాజశేఖర్, నార్ల శ్రీనివాస్, సంజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
