- వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు.
వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ జిల్లా వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఫ్రీ డౌన్ ప్రార్థన వరంగల్ సిటీ హోప్, ఫెలోషిప్స్ ఆర్గనైజేషన్స్ దైవజనులు ఉదయకాల ప్రార్థనలు చేసి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ప్రవీణ్ పగడాల అకాల మరణం తీరని లోటు అన్నారు.
ఈ కార్యక్రమంలో బిషప్. రెవరెండ్ డాక్టర్ కె.మార్టిన్ లూథర్, బిషప్ రెవ.ప్రసన్న మార్టిన్, రెవ, జోసెఫ్ ప్రభాకర్, ఎన్.జాన్సన్ , రెవ జి ప్రతాప్ రెవ జి మార్క్ పీటర్, రెవ ఎన్ మత్తయి, రెవ సీహెచ్ ఏలియా, రెవ.జి ఐజయ్య , రెవ.అహరోను రాజు, రెవ.సీహెచ్ కృపాల్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రెవ సింగారపు రాజు, రెవ .జి జాన్,రెవ .బి.జాషువా, రెవ.బి ప్రేమ్ కుమార్, రెవ ఫిలిప్, రెవ .మహేష్ రెవ.డేవిడ్ ,రెవ, ఆర్ రాజు సిస్టర్ దేబోరా, జ్యోతి, విజయ, షారోన్ పాల్గొన్నారు.
