Warangalvoice

kaveri_Bumper_Seeds

వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన

వరంగల్ వాయిస్, నడికుడ : కావేరీ సీడ్స్ కంపెనీ వారు మంగళవారం రోజున నడికుడ మండలం వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శలనలో స్థానిక వరికోలు రైతులే కాకుండా, నడికుడ మండల కేంద్రం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాంబశివ రెడ్డి వ్యవసాయ క్షత్రంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సాంబశివరెడ్డి మాట్లాడుతూ తాను చాలా కాలంగా కావేరీ కంపెనీ వారి బంపర్ ప్రత్తి రకం విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందినానని తెలియజేసారు. ఈ కార్యక్రమం సంబర్భంగా రైతులు అడిగిన పలు సందేహాలకు  కంపెనీ ప్రతినిధి దుర్గారెడ్డి వివరణ ఇస్తూ.. ప్రస్తుత ప్రత్తి సీజన్ లో రైలుకు బంపర్ ప్రతి రకం విత్తనాలు వరదాయకమని, ఈ రకం విత్తనాలు మిగితా కంపెనీ విత్తనాలకంటే అధిక దిగిబడిని ఇవ్వడమేకాక, చీడపీడలు పంటకు ఆశించవని, రసం పీల్చే పురుగులు పట్టదని, అంతే కాకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెట్ట వాతావరణంలో కూడా తట్టుకొని చక్కటి దిగుబడినిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రం నుండి 150 మందికి పైగా రైతులు పాల్గాని కావేరీ బంపర్ ప్రతి రకం విత్తనాలపై సంతృప్తి చెందినారు. రైతలతో పాటు కంపెనీ ప్రతినిధులు జి. నితిన్, లెనిన్, రంజిత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

kaveri 1 kaveri_Bumper_seeds

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *