వరంగల్ వాయిస్, ములుగు రోడ్: నగరంలోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో ఈ నెల 29 వ తేదీ శ్రావణ మాసో ఉత్సవాలు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు వరద దత్త క్షేత్రం ట్రస్ట్ సభ్యులు అడ్డగుడి వెంకటేశ్వరులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసంలో ఈ నెల 29 తేదీ మొదటి శుక్రవారం అమ్మవారికి పండ్లతో అర్చన ఆగస్ట్ 5వ తేదీన వరలక్ష్మి వ్రతాలు లక్ష్మీ హోమం, 12 వ తేదీన అమ్మవారికి పూలతో అర్చన, 19 వ తేదీన అమ్మవారికి తమలపాకులు వక్కలతో అర్చన లక్ష్మీ హోమం, 26 వ తేదీన అమ్మవారికి జాకెట్ ముక్కలతో అర్చన, 21వ తేదీన దశమి సందర్భంగా ఆశ్రమంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు సామూహిక శ్రీ అనగాష్టమి వ్రతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని శ్రీ స్వామిజీ కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.
