Warangalvoice

IMG 20240815 WA0334

రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వరంగల్ వాయిస్, కేయూ డబ్బాలు: హనుమకొండ జిల్లా పెగడపల్లి డబ్బాల ఎక్స్ రోడ్డు దగ్గర రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ ఘనంగా నిర్వహించారు. రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ, మిత్ర బృందం శ్యామ్, సతీష్, రాము, రాజకుమార్, పవన్, మనోహర్, వెంకన్న, విక్రం రాజు, వంశీ, అభిషేక్, కాలనీవాసులు రాజారాం, సుధాకర్ రావు, వెంకటేశ్వర్లు, అంజయ్య, శ్రీనివాస్, సతీష్, కుమార్ స్వామి, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
[15/08, 2:43 pm] Ravi NMR Eenaddu: 54వ డివిజన్ లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
వరంగల్ వాయిస్, హనుమకొండ: హనుమాన్ నగర్ లోని జై హనుమాన్ పరపతి సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కందికొండ సదానందం మాట్లాడుతూ మన దేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వచ్చిందని, మన దేశ ప్రజలు నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో మన దేశం ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆత్మకూరు దేవేంద్ర చారి
మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల కష్టాన్ని త్యాగాన్ని మన ప్రతి ఒక్క భారతీయుడు ఎల్లప్పుడూ మర్చిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల సూర్యనారాయణ, ఉప్పుల రాజు, సముద్రాల రాజేష్, కుంటి మురళీధర్, ధోనికల సుమన్, మట్టేవాడ చంద్రమౌళి, పోతుల ప్రవీణ్, మాటూరి ప్రసాద్, పి మండ నాగరాజు, నరసింహ చారి, మెరుగు రాజేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *