వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : మాస శివరాత్రి సందర్బంగా కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం గణపతి రుద్ర హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం అన్న పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గుండేటి రజిని కుమార్, మార్త దీపక్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
