వరంగల్ వాయిస్, హైదరాబాద్ : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మిస్సైళ్లతో మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసిన భారత సైన్యానికి సెల్యూల్ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తీవ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే ప్రక్రియలో వారికి మరింత బలం చేకూరాలి… ప్రతి ఒక్కరం భారత సైన్యానికి అండగా ఉందాం అని అన్నారు. చివరగా జైహింద్ అని కేటీఆర్ పేర్కొన్నారు.
