బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్
వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు అనుమాండ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో హాసన్ పర్తి మండల కేంద్రంలో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న ఫలాలు కొనసాగాలంటే, జనాభా దామాష ప్రకారం బీసీల వాటా బీసీలకు దక్కాలంటే, బీసీ లెక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీ కుల గణపైన పార్లమెంట్ లో చట్టం చేయాలని, జనాభాలో 55 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీలపైన క్రిమిలేయార్ ఎత్తివేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అగస్టు 7న తల్కటోర స్టేడియంలో అఖిల భారత జాతీయ ఓబిసి మహాసభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆగస్టు 8న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నుంచి పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం 29 రాష్ట్రాల నుంచి వస్తున్న వేలాది మంది బీసీ కార్యకర్తలతో చేపట్టనట్లు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. కావున ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు, బీసీ యువకులు, బీసీ మహిళలు, బీసీ విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జనగాం శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయబారపు సంపత్, హనుమకొండ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గొట్టే మహేందర్ యాదవ్, గౌడ సంఘం నాయకులు వల్లాల గంగాధర్ గౌడ్, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు సొన్నాయిల టెంకాయల రమేష్, శ్రీనివాస్ పద్మశాలి సేవా సంఘం నాయకులు గుండా యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.
