సిద్దిపేటలో అధికారులతో సవిూక్షించిన మంత్రి హరీష్ రావు వరంగల్ వాయిస్,సిద్దిపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవదశ కంటివెలుగు ప్రారంభం ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడిరచారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు ఇతర రాష్టాల్రకు చెందిన ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారని ఆయన తెలిపారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కంటి సమస్యతో ఎవరు బాధపడవద్దని రెండవదశ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు. జనవరి 18 నుంచి జూన్ 30వరకు జరిగే రెండవదశ కంటివెలుగు కొనసాగుతుందని అన్నారు. తొమ్మిది నుంచి సాయంత్రం 4గంటల వరకు సోమవారం నుంచి శుక్రవారం కంటి పరీక్ష చేస్తారని మంత్రి చెప్పారు. జిల్లాకు అదనంగా 35మంది వైద్యులను రిక్రూట్ చేశామని పేర్కొన్నారు.ఉదయం ఇప్పటికే 10లక్షల కళ్ల అద్దాలు ప్రతి జిల్లాకు చేరుకున్నాయని వివరించారు. రెండో దశ కంటి వెలుగుకు రూ. 250కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. జిల్లాలో 45 వైద్య బృందాలు, మరో మూడు అదనపు బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచం లోనే